‘హైడ్రా’ దందా.. ఎక్స్‌ వేదికగా కేటీఆర్ ఫైర్

ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతు భరోసా రాదు.. రుణమాఫీ కాదన్నారు. అలాగే పంటలు కొనుగోలు చేయర‌ని KTR విమ‌ర్శించారు. పదేళ్ల KCR పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణ(Telangana)ను 15 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లార‌ని మండిప‌డ్డారు. ఇది పాలన కాదు పీడన అని అన్నారు. అలాగే ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ అని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు మేల్కోవాల‌ని KTR పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt in TG) హైడ్రా(Hydra) పేరుతో వసూళ్ల దందాకు పాల్పడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్ర‌భుత్వంలోని కొందరు పెద్ద‌లు ఈ వ‌సూళ్ల దందాను న‌డిపిస్తున్నార‌ని ఆయన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్ల‌పై పగబ‌ట్టార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు KTR ట్విటర్ (X) వేదిక‌గా సీఎం రేవంత్(CM Revanth) సర్కార్‌ తీరు ఎండగడుతూ పోస్టు పెట్టారు. ఫోర్త్ సిటీ పేరుతో CM ఫ్యామిలీ రియ‌ల్ వ్యాపారం(Real Business) చేస్తోంద‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. RRR పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్ప‌డుతున్నారని ఫైర్ అయ్యారు.

Related Posts

కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ!

Share Tweet Pin Send సభలో కేసీఆర్ ప్రసంగాని(KCR Speech)కి ముందు, పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడి ఉండాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన నాయకులు, ధూంధాం కార్యకర్తలు ప్రసంగించి ఉంటే.. అది శ్రేణుల్లో…

TG Assembly: రుణమాఫీపై వాదోపవాదనలు.. సభ నుంచి BRS వాకౌట్

Share Tweet Pin Send మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా.. రైతు రుణమాఫీ, గృహజ్యోతి పథకాలపై అధికార, విపక్ష నేతలు వాదోపవాదనలు చేసుకున్నారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *