
ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా రాదు.. రుణమాఫీ కాదన్నారు. అలాగే పంటలు కొనుగోలు చేయరని KTR విమర్శించారు. పదేళ్ల KCR పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణ(Telangana)ను 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఇది పాలన కాదు పీడన అని అన్నారు. అలాగే ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని KTR పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt in TG) హైడ్రా(Hydra) పేరుతో వసూళ్ల దందాకు పాల్పడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ వసూళ్ల దందాను నడిపిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఆరోపించారు. ఈ మేరకు KTR ట్విటర్ (X) వేదికగా సీఎం రేవంత్(CM Revanth) సర్కార్ తీరు ఎండగడుతూ పోస్టు పెట్టారు. ఫోర్త్ సిటీ పేరుతో CM ఫ్యామిలీ రియల్ వ్యాపారం(Real Business) చేస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. RRR పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.